కన్నతండ్రికి ఆర్నెళ్లు నరకం చూపించిన తెలుగు స్టార్ హీరోయిన్..!

ముప్పై ఏళ్ళ క్రితం ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ. 

తొలి సినిమానే రంభకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత సూపర్‌ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున ఇలా స్టార్‌ హీరోలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసింది.

 తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి భాషల్లోనూ సినిమాలు చేసింది. 

2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది.

రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

సినిమాలకు గుడ్‌బై చెప్పినా.. రంభ సోషల్‌ మీడియాలో తరచూ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. 

ఇక ఈ బ్యూటీకి కోపం చాలా ఎక్కువట. 

ఒకసారి వాళ్ల నాన్న తిట్టాడని కోపంతో ఏకంగా ఆర్నెళ్ల పాటు తన తండ్రికి నరకం చూపించాడట.

 తన తండ్రితో ఆర్నెళ్లు అస్సలు మాట్లాడలేదని, తను మాట్లాడినా కానీ.. రంభ మాత్రం తిరిగి మాట్లాడేది కాదని తనే చెప్పింది. 

అలా ఆర్నెళ్ల పాటు నరకం చూపించినట్లు ఈ బ్యూటీ చెప్పింది.