వందే భారత్ రైలులో చైన్ సిస్టమ్ లేదా?
సాధారణ రైళ్లలో సడెన్గా రైలును ఆపేందుకు చైన్ సిస్టం ఉంటుంది.
వందే భారత్లో రైలును ఆపాలంటే ఏం చెయ్యాలి?
వందే భారత్ రైలులో చైన్ పుల్లింగ్ సిస్టమ్ ఉందా?
వందే భారత్లు అప్గ్రేడ్ అయిన రైళ్లు.
అందువల్ల వందేభారత్ రైలును చైన్ లాగి ఎవరూ ఆపలేరు.
అయినప్పటికీ ఈ రైలు ఆపేందుకు వీలు ఉంది.
వందే భారత్ రైలులో చైన్ సిస్టమ్కు బదులుగా అలారం సిస్టమ్ ఉంది
ప్రయాణికులు అలారం బటన్ ప్రెస్ చేసి.. మాట్లాడితే.. వారి మాటలు నేరుగా లోకో పైలట్కు వినిపిస్తాయి
అలారం లేదా వార్నింగ్ బెల్ ఎందుకు నొక్కారని లోకో పైలట్ ప్రయాణికులను అడుగుతారు.
ప్రయాణికులు సరైన కారణం చెబితే లోకో పైలట్ రైలును ఆపుతారు.